అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
*ధర్మాధర్మాల
గురించి చెబుతుంది.
*కర్తవ్యం గురించి
చెబుతుంది.
*నాగరికత అంటే
కోరికలను తీర్చుకోవడం కాదు.అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
*ఆనందంగా జీవించడం
ఎలాగో చెబుతుంది.
*సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో
చెబుతుంది.
*ఏది శాశ్వతమో ఏది
అశాశ్వతమో చెబుతుంది.
*పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
*ఆత్మ తత్త్వ
నిరూపణ చేస్తుంది.
*స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
*జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే
ఏమిటో చెబుతుంది.
*ఎవడు పండితుడో
ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
*ప్రతిఫలాపేక్ష
లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
*మంచి పనులు
చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి
ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే
మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల
ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
*నీలానే ఇతర
ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను
నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు
ధన్యులు. మానవుడు ఎలా అభ్యున్నతి
సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో
రాత మార్చుకో
*********
0 Comments
Dear viewer Please donot enter any spam links