Why Cows Are Considered Holy Animals In Indian - భారతీయులు ఆవును ఎందుకు పవిత్రంగా భావించేవారు?


భారతీయులు ఆవును ఎందుకు పవిత్రంగా భావించేవారు?

భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి.


ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను ‘అమృతం’ అని చెప్పబడింది. ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవి వాడబడుతాయి. ఇతర ప్రాణుల మలాన్ని అశుద్ధంగా చెప్పబడినా, ఆవు పేడ మాత్రం ఎంతో సుభకరమైనదిగా చెప్పబడింది. సైన్స్ ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆవు పేడ చెడువాసన లేనిదేకాక అనుకూల శక్తిని వెల్లడిస్తుందని అని చెప్పడం జరిగింది. మొక్కలకు మరియు చెట్లకు ఆవుపేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఔషదాలలో ఆవు మాత్రం ఎంతో వైభవాన్ని కలిగివుంది. పూజల్లో సైతం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గొప్ప ఔషదగుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదుటి భాగంలో ఓ సంచిలాంటి దానిలో ఉంటుంది. గోరోజనము ఆయుర్వేదం సూచించే ఓ గొప్పదిఎన ఔషదం.


ఇన్నీ ప్రయోజనాలతో ఉపయోగాత్మకమైన ఆవుకు ‘గోమాతా అనే పేరు సార్ధకమైనదే. లోకాస్సమస్తాస్సుఖినోభవంతు


 

Post Navi

Post a Comment

0 Comments